”……”
”వారానికి ఒక్కసారి ఇంటికి వస్తాను నేను. వచ్చేటప్పటికి ఇల్లు ప్రశాంతంగా ఉంచలేవూ?”
అతడు అతి మెల్లగా చెబుతున్నా, మాటల పదును ఆమె గుండెల్లో గుచ్చుకుంది.
ఆదమరచి శయనించి ఉన్నామె ఒక్కసారి లేచి కూర్చున్నది.
”ఇది మీరు నన్ను అనవలసిన మాటేనా? మీ సంతోషం కోసం, సుఖంకోసం నేనేమి చేయగలనో అంతా చేస్తానని మీకు తెలుసు!” అంటున్న సీత కంఠం దుఃఖావేశంతో కంపించింది.
ప్రేమనగర్ వంటి అమూల్యమైన నవలను అందించి తెలుగు పాఠకులలో ఓ ప్రత్యేక స్థానాన్ని అలంకరింపచేసుకొని తనదైన బాణీతో పాఠకులకు అందిస్తున్న శ్రీమతి ఆరెకపూడి(కోడూరి) కౌసల్యాదేవిగారి సుదక్షిణ
తప్పక చదవండి!!