Arikepoodi(Kowdoori)Kowshyalya Devi
--
”నన్ను నమ్మండి నళినీ బాబూ! మీ మామ మీకో విధంగా అన్యాయం చేశాడు. నాకొక విధంగా అన్యాయం చేశాడు. నిస్సహాయతవల్ల… ఘోటక విషాలన్నీ పానం చేస్తున్నాను… శిరి ఏ పాపమూ ఎరుగదు. మీరిలా వెళ్ళిపోతే ఆత్మహత్య చేసుకోగలదు…” అన్నది గాయత్రి. ఆ కొద్ది సంభాషణలో ఘోరమైన రహస్యం చెప్పింది. ఆమె మాటలు పూర్తికాకుండానే నేలకొరిగి పోయింది. ఆమె వీపున కృత్తి… నళినీకాంతుడు కర్తవ్య నిర్వహణలో ఆలస్యం చేయలేదు శిరీషతో చెప్పాడు. ‘నిజం నీకు చెప్పాను, ధైర్యంగా నిలబడతావో, లేక తండ్రిపై ప్రేమ నీ మనస్సును జయిస్తుందో నాకు తెలియదు.’ అన్నాడు. శిరీష శరాఘాతం తగిలినట్టే చూచింది. ‘నువ్వు… నువ్వు… నన్ను శంకిస్తున్నావా బావా? అలక నీకెలాచెల్లెలో, శ్రీనాథుడు నాకలా అన్న అంతే’ అన్నది. ఉదాత్త పాత్రలతో, గుండెలు జలదరింపజేసే ఉత్కంఠతతో, ఊపిరి సలపనీయని సంఘటనలతో గలగల పారే గోదావరిలా, మనోహర వర్ణ చిత్రంలా సాగిన కమనీయ నవల…
Title | నందనవనం |
Writer | ఆరికెపూడి (కోడూరి) కౌసల్యాదేవి |
Category | భాషాసాహిత్యాలు |
Stock | Not Available |
ISBN | |
Book Id | SPI035 |
Pages | 320 |
Release Date | 01-Mar-2014 |