ఇప్పుడు మీతో నేను ఇంత సన్నిహితంగా వుండటానికి నాకు సహకరిస్తున్న వారి గురించి తెలియజేస్తాను.
చంద్రశేఖర రెడ్డి గారి బృందం
వీరు ప్రధాన సంపాదకులు. అంటే ప్రతి పుస్తకాన్ని చదువుకోవడానికి వీలుగా వుందో లేదో పరిశీలించి
దానిలో భాషాపరమైన మార్పులు అవసరమైతే చేసి పుస్తకంలోని విషయానికి ఓ చక్కని రూపాన్ని ఇస్తారన్నమాట.
వీరు సుప్రసిద్ధ భాషా శాస్త్రవేత్త, పత్రికా రచయిత, కవి, సాహితీప్రశంసకులు.
పురుషోత్త్ కుమార్ బృందం
వీరు ప్రీప్రెస్, ప్రెస్ విభాగాలను నిర్వహిస్తారు. చంద్రశేఖర్ రెడ్డిగారి బృందం సరిచూసి
వీరికి అందజేసిన రాతప్రతుల్ని పుస్తక రూపంలోకి మార్చడం వీరి పని.
ఈరోజు మన ఎమెస్కో పుస్తకాలు ఇంత అందంగా వుంటున్నాయంటే
కంప్యూటర్ మీటలపై వీరి బృందం చేసే విన్యాసాలే కారణం.
డి.టి.పి. నుంచి కవర్ డిజైనింగ్ వరకు వీరి పర్యవేక్షణలో జరుగుతుంది.
లక్ష్మీ బృందం
వీరు సాహిత్య ప్రచురణల మార్కెటింగ్ విభాగానికి అధిపతి. విజయవాడ వీరి కార్యస్థానం.
విజయవాడ కార్యాలయం నిర్వహణ, నవలల విభాగం, ప్రచురణలను వీరు పర్యవేక్షిస్తారు.
ఇరవై సంవత్సరాలుగా ఎమెస్కో సంస్థలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు.
సురేంద్ర బృందం
వీరు లాజిస్టిక్ మేనేజ్మెంట్ విభాగాన్ని పర్యవేక్షిస్తారు.
సుబ్రహ్మణ్యం బృందం
వీరు అకౌంటింగ్ విభాగాన్ని పర్యవేక్షిస్తారు.
పాండు రంగడు బృందం
ఈయన ఈ సంస్థ ప్రధాన నిర్వహణాధికారికి సహాయకుడు.
నిరంతరం అందుబాటులో వుండే మానవ వనరుల నిర్వాహకుడు.
సుమన్ కుమార్
విద్యా విషయక ఉపకరణాల తయారీకి సంబంధించిన కార్యక్రమాలను నిర్వహిస్తారు.
దూపాటి నరేంద్ర
వీరు ఇంజనీరింగ్లో స్నాతకానంతర విద్యను అమెరికాలో అభ్యసించి పుస్తక ప్రచురణ పట్ల ఆసక్తితో సంస్థలో సభ్యులయ్యారు.
కొత్తగా ఎలాంటి పుస్తకాలు తీసుకురావాలో పరిశీలించే రీసెర్చి అండ్ డెవలప్మెంట్ విభాగాన్ని నిర్వహిస్తారు.
దూపాటి బాలమురళీకృష్ణ
వీరు విజయవాడ షోరూమ్ నిర్వహణ, ప్రజా సంబంధాల నిర్వహణ చేస్తూ
సంస్థ ప్రధాన కార్యనిర్వాహకుడికి చేదోడువాదోడుగా వుంటారు.
ఈ బృందాన్ని సమన్వయం చేసే కార్యక్రమాన్ని ఈ క్రింది వ్యక్తులిద్దరూ చూస్తారు.
కె. సుధీర్ కుమార్
సహ ప్రధాన కార్యనిర్వాహకుడు. మార్కెటింగ్ విభాగాన్ని పర్యవేక్షిస్తారు.
సాహిత్యం పట్ల అభిలాష, లోతైన పరిశీలనాదృష్టి వీరి సొంతం.
ఎమెస్కో విజయకుమార్
ప్రధాన కార్యనిర్వాహకులు. సంస్థ మేధావనరుల నిర్వహణ వీరి ప్రధాన బాధ్యత.
పై వాళ్ళందరూ మీకు నాకు వారధులు. పై వారిలో కొన్ని కొత్త పేర్లు వచ్చి చేరవచ్చు.
కొన్ని పేర్లు పై జాబితాలో తొలగి పోవచ్చు.
అయితే మన మధ్య బంధం అక్షరం వున్నంతవరకూ వుంటుంది.