హరివంశంతో మహాభారతం సంపూర్ణం. సంస్కృతంలో వ్యాసమహాముని రచించిన హరివంశాన్ని కవిత్రయంలో ఒకడైన ఎర్రన మనోహరంగా తెనిగించాడు. ఎర్రనగారి గద్యపద్య రచనకు పిలకా గణపతి శాస్త్రిగారి మనోజ్ఞ వచనానుసరణం ఇది.
భారతకథ విని అంతటితో తృప్తి చెందని శౌనకాది మునులకు ఉగ్రశ్రవసుడు శ్రీ కృష్ణ చరితమైన హరివంశాన్ని వినిపించాడు. పూజ్యతమమూ, వంశవర్ధనమూ, సమస్త పుణ్య ఫలదమైన ఈ హరివంశ కథ తప్పక చదవదగింది.