విజ్ఞానశాస్త్రం ఎంత పెరిగినా ప్రపంచంలో అర్థంగానిది ఇంకా చాలా వుంది. వేదాంత శాస్త్రంతో విజ్ఞానశాస్త్రాన్ని సమన్వయించుకొని ముందుకు సాగితే ఆటంబాంబుల వంటి దుష్పరిణామాలకు చోటు ఉండదు. అందుకనే శ్రీ వివేకానందుడు పాశ్చాత్య విజ్ఞానము, ప్రాచ్య వేదాంతము, ఆత్మలో సమన్వయించిన మానవుడే ఆదర్శ మానవుడు కాగలడని ప్రవచించారు.