Panuganti Lakshmi Narasimha Rao
--
పానుగంటివారు సాక్షివ్యాసాలకు ఒక ఆదర్శం ఏర్పరచుకున్నారు. వ్యక్తి విమర్శ చేయకూడదు, తత్త్వవిమర్శ
మాత్రమే చేయాలన్నది ఆ ఆదర్శం. దోషాన్ని విమర్శించాలే తప్ప ఆదోషం చేసిన వ్యక్తిని కాదన్నమాట. దీనివల్ల వ్యక్తి, జాతి విరోధాలుప్పతిల్లవు. దోషాలు, నేరాలపట్ల వ్యక్తులకు ఏవగింపు కలుగుతుంది. వాటికి పాల్పడకుండా ఉంటారు. ఇదీ ఆశయం. ఈ రచయిత ప్రభుత్వానికి వ్యతిరేకికాదు. అతనికి రాజకీయాలు లేవు. అందువల్ల సాక్షి రాజకీయాలను విమర్శించలేదు. మత, ఆరోగ్య విషయాలు, సంఘ దురాచారాలు, చరిత్ర, సాహిత్యం మొదలైన విషయాలకు సంబంధించి ఇదీ అదీ అనక సమాజంలో కనిపించిన ప్రతి చెడునూ తూర్పార పట్టింది.
| Title | సాక్షి |
| Writer | పానుగంటి లక్ష్మీనరసింహారావు |
| Category | భాషాసాహిత్యాలు |
| Stock | 100 |
| ISBN | 978-93-80409-96-2 |
| Book Id | EBK037 |
| Pages | 1088 |
| Release Date | 14-Nov-2011 |