”రేపు సూర్యోదయం తర్వాత నగరంలోని చైతన్య వంతులయిన పౌరులు రోడ్ల మీద పోలీసుల్ని ఆపి మానవ హక్కుల్ని గురించి ప్రశ్నలు అడుగుతారు. ఏ ఒక్క పోలీసు సరైన సమాధానం ఇవ్వలేక పోయినా ఆపైన మీ రివాల్వర్ మీకు దొరకదు.”
తెలుగు పాప్యులర్ నవలా సాహిత్యంలో తనదైన సొంత ముద్ర వేసుకున్న మాగంటి మానవ హక్కుల మీద చేసిన మొట్టమొదటి ప్రయత్నం ‘బందూకం సంధ్యారాగం.’ ఇది అనేక విమర్శల పాలయిన తెలుగు పాప్యులర్ నవలకు ఒక ధీమాని, ఒక హుందాతనాన్ని కొనితెస్తోంది. పాప్యులర్ నవల మూస లోకి మానవ హక్కు ల్లాంటి అంతర్జాతీయ ప్రాధాన్యం గల సీరియస్ టాపిక్ని బ్లెండ్ చేసి మాగంటి ఏర్పరచిన కొత్త దారి, పాప్యులర్ నవలకు జవ సత్వాలను, కొత్త ఊపును ఇస్తోంది.