దగ్గుబాటి పురంధేశ్వరి ప్రసంగాలు
అనువాదం :- యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
అన్ని రంగాల్లో ఆమె సాధించిన విజయాలకు ఆసియన్ ఏజ్ ఆమెను 2004-05 సంవత్సరానికి ఉత్తమ పార్లమెంటేరియన్గా ప్రకటించింది. పార్లమెంట్లో ఆమె నిర్వహించిన పాత్ర యుపిఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ, ప్రధానమంత్రి డా. మన్మోహన్ సింగ్, అప్పటి లోక్సభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ దృష్టిని ఆకర్షించింది. పలు అంతర్జాతీయ పార్లమెంటరీ ప్రతినిధి వర్గాలకు ఆమె ఎంపికయ్యారు. జెనీవా, మాల్దీవులు, జపాన్, జర్మనీ, మాస్కో, కైరో, లండన్, దక్షిణాఫ్రికా, వాషింగ్టన్, కౌలాలంపూర్, నేపాల్ మొదలైన ప్రాంతాలను ఆమె సందర్శించి ప్రజల సమస్యలపై విస్పష్టంగా తన అభిప్రాయాలను ప్రకటించారు. ఆమె ప్రతిపాదించిన సవరణలు, సూచనలు పలు అంతర్జాతీయ తీర్మానాల తుది ముసాయిదాలో చోటు చేసుకున్నాయి. వైట్హౌజ్లో ప్రపంచ అక్షరాస్యతపై సెమినార్లో ప్రసంగించేందుకు అమెరికా ప్రభుత్వం ఆహ్వానం పంపడం ద్వారా ఆమెను గౌరవించింది. మహిళల సాధికారికత నుంచి భారతీయ సంస్కృతి, జ్యోతిష్యం వరకూ, పరిశ్రమల సమస్యల నుంచి పర్యావరణం వరకు ఆమె గత మూడేళ్లలో చేసిన పలు ప్రసంగాల సంకలనం ఇది…