సమకాలీన భారతీయ దార్శనికుల్లో అగ్రేసరుడైన ఒక తత్త్వవేత్త వేదాలను అర్థం చేసుకోడానికీ, వ్యాఖ్యానించడానికీ చేసిన ప్రయత్నం ఈ పుస్తకం. వేదాలపై ఇంతదాకా వచ్చిన ఆధునిక భారతీయ, పాశ్చాత్య వ్యాఖ్యానాల గురించి ఆయనకు క్షుణ్ణంగా తెలుసు. అయినప్పటికీ ఆయన వేదాలను అర్థం చేసుకోవడం కోసం ప్రధానంగా నిరుక్తంవైపూ, పూర్వఉత్తరవిూమాంసల వైపూ, స్మృతి ఇతిహాసపురాణాల వైపూ, సాయణుల వైపూ, ఇతర భాష్యకారుల వైపూ మొగ్గు చూపడం ఈ రచనలో విశేషం.